తేజ దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ చేస్తున్న మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ చిత్రమైన ‘ఎన్.టి.ఆర్’కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా చిత్ర యూనిట్ ఈ బయోపిక్కి సంబంధించిన పోస్టర్ని విడుదల చేసింది. అసలైతే జనవరి 18 ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ బయోపిక్కి సంబంధించిన టీజర్ని విడుదల చేయాలని చూశారు. అనివార్య కారణాల వల్ల టీజర్ని విడుదల చేయడం లేదని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ‘‘ ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయంగా జీవించిన.. ఓ మహానుభావునికి ఇదే మా నివాళి..’’ అంటూ ఎన్టీఆర్ ఎలక్షన్ల టైమ్లో ప్రచారం చేస్తున్న లుక్లో బాలయ్య ఉన్న ఫొటోను విడుదల చేశారు. ఇక ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తుండగా బాలకృష్ణ, సాయి కొర్రపాటిలు నిర్మిస్తున్నారు. విష్ణువర్ధన్ ఇందూరి కెమెరామెన్ కాగా, ఎమ్. ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

No comments:
Post a Comment